
భైంసా, వెలుగు: ప్రజల ఆరోగ్యం, సంరక్షణే తన అంతిమ లక్ష్యమని ముథోల్ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు. నిర్మల్ జిల్లా భైంసాలోని గవర్నమెంట్హాస్పిటల్లో గురువారం ఆయన మీటింగ్ నిర్వహించారు. హాస్పిటల్లో సీటి స్కానింగ్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఏరియా హాస్పిటల్లో కార్పొరేట్తరహా వైద్య సేవలు అందించాలన్నది తన లక్ష్యమన్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్ అహ్మద్, సూపరింటెండెంట్ కాశీనాథ్ తదితరులు ఉన్నారు.