Muthyala Subbaiah: ముత్యాల సుబ్బయ్య ‘తల్లి మనసు’ మూవీ షూటింగ్ కంప్లీట్.. స్టోరీ ఇదే !

Muthyala Subbaiah: ముత్యాల సుబ్బయ్య ‘తల్లి మనసు’ మూవీ షూటింగ్ కంప్లీట్.. స్టోరీ ఇదే !

సీనియర్ దర్శకులు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో  ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ నిర్మిస్తున్న తొలి చిత్రం ‘తల్లి మనసు’. వి శ్రీనివాస్ (సిప్పీ) దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య  ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గురువారంతో ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తయిందని తెలియజేశారు మేకర్స్.

ఓ మధ్య తరగతి తల్లి చుట్టూ తిరిగే చక్కటి కుటుంబ కథా చిత్రమిదని,  ఆమె మనోవేదన, సంఘర్షణను ఇందులో చూపించనున్నట్టు దర్శకుడు సిప్పీ చెప్పాడు. సింగిల్ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో షూటింగ్ కంప్లీట్ చేశామని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు  జరుగుతున్నట్టు నిర్మాత కిషోర్ అన్నారు.దర్శకుడు వి.శ్రీనివాస్‌ (సిప్పీ) మాట్లాడుతూ, ‘ఓ మధ్య తరగతి తల్లి చుట్టూ తిరిగే కుటుంబ కథ ఇది. పలురకాల భావోద్వేగాలు, ఆ తల్లి సంఘర్షణల నేపథ్యంలో ఈ చిత్రాన్ని మలిచాం’ అని తెలిపారు.

‘ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలన్న తపనతో మా అబ్బాయి నిర్మాతగా చేస్తున్న చిత్రమిది. వాస్తవిక జీవితానికి అద్దంపట్టే విధంగా ఉంటుంది’ అని చిత్ర సమర్పకులు ముత్యాల సుబ్బయ్య అన్నారు. రఘుబాబు, శుభలేఖ సుధాకర్, దేవిప్రసాద్, ఆదర్శ్ బాలకృష్ణ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కోటి సంగీతం అందిస్తున్నారు.