హైదరాబాద్‌లో MIM, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పరస్పర దాడి

హైదరాబాద్‌లో MIM, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పరస్పర దాడి

హైదరాబాద్ లోని అసిఫ్ నగర్ పిఎస్ పరిధిలో సోమవారం MIM, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. నాంపల్లి MLA మాజిద్ హుస్సేన్, కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ అనుచరులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. బ్యాంకు కాలనీలోని సిసిరోడ్డు పనులు పరిశీలించేందుకు కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ ఖాన్‌ వచ్చారు. ఫిరోజ్ ఖాన్ తో పాటు అతని అనుచరులపై నాంపల్లి ఎంఎల్యే మాజిద్ హుస్సేన్ అనుచరులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఒకరిపై ఒకరు పరస్పర దాడి చేసుకున్నారు. 

ALSO READ | మేడ్చల్ పారిశ్రామిక వాడలో 11కెవీ వైర్లు తెగిపడి ఘోర ప్రమాదం

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ కు, ఫిరోజ్ ఖాన్ కు నచ్చ చెప్పి ఘటనాస్థలం నుంచి పంపించారు.  ఆ తర్వాత ఇద్దరు నేతల అనుచరులను అక్కడి నుంచి వెళ్లగొట్టారు.