ద్వేషంలో నాన్న : నా కూతురు అంజూ అలియాస్ ఫాతిమా చ‌చ్చిపోయింది

ద్వేషంలో నాన్న  :  నా కూతురు అంజూ అలియాస్ ఫాతిమా చ‌చ్చిపోయింది

ఫేస్ బుక్ ప్రియుడి కోసం పాకిస్థాన్ కు వెళ్లిన రాజస్థాన్ కు చెందిన వివాహిత అంజూ అలియాస్ ఫాతిమాపై ఆమె తండ్రి గయా ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.       తన కూతురు ఇండియా నుంచి పాకిస్థాన్‌కు వెళ్లిన క్షణంలోనే ఆమెతో తనకు సంబంధాలు తెగిపోయాయని అన్నారు.  తన కూతురు ఇలాంటి పనిచేస్తు్ందని ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు.  ఆమె చేసిన పని చాలా సిగ్గు చేటున్నారు. ఎందుకంటే ఇది మనకే కాదు యావత్ భారతదేశానికి సంబంధించినదని  ఆయన అభిప్రాయపడ్డారు.  అలాంటి కూతురికి తండ్రి అయినందుకు సిగ్గుపడుతున్నామని తెలిపారు.  

#WATCH | Gwalior, Madhya Pradesh | Gaya Prasad, father of Anju who travelled to Pakistan says, "We don't have any relations with her (Anju). The moment she left India, we cut off all ties with her...I had never imagined that my daughter can do something like this...What she has… pic.twitter.com/aN0YvI8RpM

— ANI (@ANI) July 26, 2023

అంజూ తన ఇద్దరు పిల్లల భవిష్యత్తును నాశనం చేసిందన్నారు గయా ప్రసాద్.. అలా చేయాలంటే ముందుగా తన  భర్తకు విడాకులు ఇచ్చి ఉండాల్సింది. ఆమె 13 ఏళ్ల అమ్మాయి,ఐదేళ్ల అబ్బాయిని ఎవరు చూసుకుంటారు? తన పిల్లల భవిష్యత్తును, భర్తను  అంజూ  నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.  అంజు తనతో మాట్లాడలేదని తన తల్లితో మాత్రమే మాట్లాడిందని ఆయన చెప్పారు. అంజూకు పాస్‌పోర్టు ఎలా వచ్చిందో, వీసా ఎప్పుడు వచ్చిందో తనకు తెలియడం లేదన్నారు.  

ALSO READ :రెయిలెంగే కాపాడింది.. వంతెనపై ఇరుక్కున్న ఇద్దరు బైకర్స్.. 

ఉత్తరప్రదేశ్‌లోని కైలోర్ గ్రామంలో జన్మించి రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఉంటున్న అంజు (34) 2019లో ఫేస్‌బుక్‌లో 29 ఏళ్ల పాకిస్థాన్ కు చెందిన నస్రుల్లాతో స్నేహం చేసింది. అతడితో స్నేహం పెళ్లికి దారి తీసింది.  అంజు ఇస్లాం మతంలోకి మారి ఇప్పుడు ఫాతిమా అనే కొత్త పేరు పెట్టుకుంది. ప్రస్తుతం పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఉంది.