మై హోమ్‌‌‌‌‌‌‌‌ గ్రూప్ నుంచి మై హోమ్ అక్రిదా ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌

మై హోమ్‌‌‌‌‌‌‌‌ గ్రూప్ నుంచి మై హోమ్ అక్రిదా ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రియల్‌‌‌‌‌‌‌‌  ఎస్టేట్ కంపెనీ మై హోమ్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌  మరో ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్  మై హోమ్‌‌‌‌‌‌‌‌ అక్రిదాను లాంచ్ చేసింది.  ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను తెల్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్‌‌‌‌‌‌‌‌ – గోపన్‌‌‌‌‌‌‌‌పల్లి దగ్గర నిర్మించనుంది. ఐటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌‌‌‌‌‌‌‌, గచ్చిబౌలి, హైటెక్‌‌‌‌‌‌‌‌ సిటీకి ఈ ప్రాజెక్ట్ దగ్గరగా ఉందని మై హోమ్‌‌‌‌‌‌‌‌ ఓ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది.  12  టవర్లలో మొత్తం 3,780 ఫ్లాట్లను నిర్మిస్తామని, ఫేజ్ 1 కింద ఆరు టవర్లలోని ఫ్లాట్ల కోసం బుకింగ్స్ ఓపెన్ చేశామని వెల్లడించింది.

 మై హోమ్ అక్రిదాను మై హోమ్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌, ప్రతిమ గ్రూప్ కలిసి కడుతున్నాయి. మై హోమ్‌‌‌‌‌‌‌‌ సయుక్‌‌‌‌‌‌‌‌ కోసం కూడా ఈ రెండు కంపెనీలు కలిసి పనిచేశాయి. మై హోమ్ అక్రిదాను మొత్తం 24.99 ఎకరాల్లో నిర్మించనున్నారు. ఒక టవర్‌‌‌‌‌‌‌‌లో గ్రౌండ్ ప్లస్ 39 ఫ్లోర్లను కట్టనున్నారు. 2 బీహెచ్‌‌‌‌‌‌‌‌కే, 2.5 బీహెచ్‌‌‌‌‌‌‌‌కే, 3 బీహెచ్‌‌‌‌‌‌‌‌కే ప్రీమియం అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లను 1,399– 2,347 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు.