గూడ్స్ రైలును ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ ట్రైన్.. మంటల్లో చిక్కుకున్న రెండు బోగీలు

గూడ్స్ రైలును ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ ట్రైన్.. మంటల్లో చిక్కుకున్న రెండు బోగీలు

చెన్నై శివారులో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న గూడ్స్ రైలును మైసూర్ - దర్భంగా(బాగమతి) ఎక్స్‌ప్రెస్ ఢీకొంది. ఈ ఘటనలో రెండు బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. మరో ఆరు కోచ్‌లు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గుమ్మిడిపూండి సమీపంలోని కవరపేటై వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ టి ప్రభుశంకర్ తెలిపారు.