- మంత్రి హరీశ్రావును కలిసిన డిస్టెన్స్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్
హైదరాబాద్, వెలుగు: నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్ఎడ్యుకేషన్లో చదివిన తమ సర్టిఫికెట్లను అనుమతించాలని పలువురు స్టూడెంట్స్ మంత్రి హరీశ్రావును కోరారు. ఈ మేరకు బుధవారం ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణలోనే ఎగ్జామ్స్ రాశామని, జురీస్డిక్షన్ పేరుతో తమ సర్టిఫికెట్లు చెల్లవని చెబుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. నాగార్జున వర్సిటీ డిస్టెన్స్లో చదువుకున్న స్టూడెంట్స్ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉంటారని, ఇప్పుడు వాళ్లంతా జాబులకు అనర్హులని చెప్పడం ఎంత వరకు సమంజసమని అన్నారు. ప్రతి నోటిఫికేషన్లో ఆ నిబంధనను పొందుపరుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పేద విద్యార్థులే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువుతారని, చదువులు పూర్తయ్యేవరకు స్టడీ సెంటర్లపై చర్యలు తీసుకోకుండా ఇప్పుడు సర్టిఫికెట్లు చెల్లవని చెప్పడం న్యాయం కాదని వాపోయారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల లక్షల ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎడ్యుకేషన్ అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చినట్టు స్టూడెంట్స్ తెలిపారు. అనంతరం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రిని కలిసి వారి సమస్యను వివరించారు. ఈ విషయంపై యూజీసీకి లేఖ రాస్తానని ఆయన హామీ ఇచ్చినట్టు విద్యార్థులు తెలిపారు.