
- పోలీసుల అదుపులో ఆరుగురు యువకులు
- పరారీలో ఇద్దరు
- నాగర్కర్నూల్జిల్లాలో ఘటన
హైదరాబాద్: దైవ దర్శనానికి వచ్చిన యువతిపై 8 మంది యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. నాగర్కర్నూల్జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఊర్కొండ మండలం ఊర్కొండపేట లోని ఆలయానికి మహబూబ్నగర్జిల్లాకు చెందిన ఓ యువతి బంధువులతో కలిసి నిన్న సాయంత్రం వచ్చారు.
దైవ దర్శనం అనంతరం టెంఫుల్దగ్గర రాత్రి నిద్ర చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో యువతి కాలకృత్యాల కోసం సమీప గుట్ట ప్రాంతంలోకి వెళ్లగా, అక్కడ మాటువేసిన యువకులు ఆమెను అడ్డుకున్నారు. యువతి బంధువుపై దాడిచేసి చేతులు కట్టేశారు. ఆమెను బలవంతంగా సమీపంలోని గుట్ట ప్రాంతంలోకి తీసుకెళ్లి సామూహిక లైంగికదాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులను ఊర్కొండపేట గ్రామానికి చెందిన ఎనిమిది మందిగా గుర్తించారు. వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.