నక్ష సర్వేతో ఇండ్ల వివాదాలకు చెక్.. యజమాని పూర్తి వివరాలతో ప్రాపర్టీ కార్డులు

నక్ష సర్వేతో ఇండ్ల వివాదాలకు చెక్.. యజమాని పూర్తి వివరాలతో ప్రాపర్టీ కార్డులు
  • కొడంగల్​ మున్సిపాలిటీలో సర్వే షురూ

కొడంగల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్రం చేపట్టిన నక్ష సర్వేతో ఇల్లు, స్థలాల వివాదాలకు పరిష్కారం లభిస్తుందని వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ సుధీర్, సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధి సుధీర్​గోళి తెలిపారు. కొడంగల్​మున్సిపాలిటీలో మంగళవారం నక్ష సర్వేను ప్రారంభించారు. వ్యవసాయ భూముల మాదిరిగా పట్టణంలో సర్వే నిర్వహించి ఇల్లు, భూములు, ప్రభుత్వ స్థలాలను గుర్తించి మ్యాప్​లు రూపొందించనున్నట్లు చెప్పారు. అనంతరం యజమాని పేరు, ప్రాపర్టీ వివరాలతో ఆధార్​ కార్డు మాదిరిగా యూనిక్​ఐడెంటిటీ నెంబర్​తో ప్రాపర్టీ కార్డు జారీ చేయనున్నట్లు వివరించారు.

నక్షతో పారదర్శకంగా ఆస్తి పన్ను, మార్కెట్​ విలువ పెరుగుదల, అభివృద్ధి, మౌళిక సదుపాయాల కల్పనకు అవకాశం ఉంటుందన్నారు. బ్యాంకుల ద్వారా లోన్​లు తీసుకునేందుకు ప్రాపర్టీ కార్డులు ఉపయోగపడతాయన్నారు. కడా స్పెషల్​ఆఫీసర్​వెంకట్​రెడ్డి, జిల్లా లైబ్రరీ చైర్మన్​రాజేశ్​రెడ్డి, నోడల్​ఆఫీసర్​ఉమామహేశ్వర్​రావు, సమీరుద్దీన్, తహసీల్దార్​విజయ్​కుమార్, కమిషనర్​బలరాం నాయక్, ఎంపీడీఓ ఉషశ్రీ పాల్గొన్నారు.