
ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా ఆదివారం భగత్ సింగ్ 94వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. వివిధ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భగత్సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు భగత్ సింగ్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ పాలకులను ఎదిరించి 23 ఏండ్ల వయసులోనే ఉరికంబాన్ని ముద్దాడిన వీరుడు భగత్సింగ్అని కొనియాడారు. భగత్ సింగ్ స్ఫూర్తితో మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. - వెలుగు, నెట్వర్క్