లండన్ లో నల్గొండ జిల్లా యువకుడు మృతి

లండన్ లో నల్గొండ జిల్లా యువకుడు మృతి

డిండి, వెలుగు : లండన్ లో నల్గొండ జిల్లాకు చెందిన యువకుడు మృతిచెందాడు. బంధువులు, గ్రామస్తుల తెలిపిన మేరకు.. డిండి మండలం తవక్లాపూర్ గ్రామానికి చెందిన వేముల వెంకటేశ్వరరావు, రజిత దంపతుల కొడుకు శ్రీకాంత్ రావు (29) హైదరాబాద్​లో బీటెక్ చదివాడు.  2020లో ఉన్నత చదువుకు లండన్ వెళ్లి ఎంఎస్ పూర్తి చేశాడు. 2021, ఆగస్టులో అక్కడే అతడు అనారోగ్యానికి గురవగా.. వైద్య పరీక్షలు చేయించుకోగా బ్లడ్ క్యాన్సర్ అని తెలిసింది. మెడిసిన్ వాడుతుండగా.. ఈనెల 20 శ్రీకాంత్ తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు చనిపోయాడు. అతని మృతితో కుటుంబంలో, సొంతూరిలో  తీవ్ర విషాదం నెలకొంది. శ్రీకాంత్ డెడ్ బాడీ శనివారం ఇండియాకు రానుందని కుటుంబ సభ్యులు తెలిపారు.