ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్పై నాంపల్లి కోర్టు సీరియస్

ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్పై నాంపల్లి కోర్టు సీరియస్

 బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాక ర్ పై నాంపల్లి కోర్టు సీరియస్ అయింది. తనపై బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయ కురాలు దీపదాస్ మున్షీ కోర్టులో పరువునష్టం దావా వేశారు. కేసు విచారణలో భాగంగా ఈ రోజు దీపదాస్ మున్షీ కోర్టుకు హాజరయ్యారు. అయితే ఈ కేసులో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ను కోర్టుకు వచ్చి ఆధారాలు చూపించాలని న్యాయ స్థానం పలుమార్లు ఆదేశించినా ఆయన హాజ రుకాలేదు. ఇవాల్టి వాయిదాకు కూడా ఆయన రాకపోవడంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ALSO READ | వరంగల్‌లో రూ.650 కోట్లతో రైల్వే మ్యానుఫ్యాక్చర్ యూనిట్ : మంత్రి కిషన్ రెడ్డి

 ప్రభాకర్ నవంబర్ 5న కచ్చితంగా న్యాయస్థానం ముంగిట హాజరుకావాలని జడ్జి ఆదేశించారు. అనంతరం కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. దీపదాస్ మున్షి ముడుపులు, కారు తీసుకున్నారని కావాలనే ఆమెపై వ్యాఖ్యలు చేశారని, అవి నిరాధారమన్నారు. ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను న్యాయమూర్తి ముందు సాక్ష్యంగా ఉంచామని తెలిపారు.