Akhanda2: కాదని దాన్ని తాకితే జరిగేది తాండవమే.. అఖండ2లోని డైలాగ్‌తో గర్జించిన బాలకృష్ణ

Akhanda2: కాదని దాన్ని తాకితే జరిగేది తాండవమే.. అఖండ2లోని డైలాగ్‌తో గర్జించిన బాలకృష్ణ

బాలయ్య-బోయపాటిల(BB4) అఖండ2-తాండవం మొదలైంది. నేడు (అక్టోబర్ 16న) హైదరాబాద్లో పూజా కార్యక్రమం గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు మేకర్స్తో పాటు బాలకృష్ణ కుమార్తెలు నారా బ్రాహ్మణి, తేజస్విని, ఇతర కుటుంబసభ్యులు ఈ వేడుకలో సందడి చేశారు.

బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణి ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టగా.. చిన్న కూతురు తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేసారు. కాగా సినిమాకు తేజస్విని కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

ALSO READ | తక్కువ అంచనా వేయకండి: ఛాలెంజ్‌ చేస్తున్నా.. కంగువా రూ.2 వేల కోట్లు పక్కా!: నిర్మాత షాకింగ్ కామెంట్స్

ఈ వేడుకలో బాలయ్య బాబు అఖండ2లోని డైలాగ్‌తో గర్జించాడు."ఉక్కరపోత అని ఊరుమీద పడితే..చూస్తూ ఉరుకోవడానికి ఈ నేల అసురిడిది కాదురా.. ఈశ్వరుడిది పరమేశ్వరుడిది.. కాదని దాన్ని తాకితే జరిగేది తాండవం..అఖండ తాండవం" అంటూ పూనకాలు తెప్పించాడు. దాంతో ఇక ఇప్పుడు బాలయ్య-బోయపాటిల నాలుగో సినిమాగా అఖండ 2 పై భారీ అంచనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ వేడుకకి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటున్నాయి. 

మొదటి భాగంలో లాగే ఈ సీక్వెల్ లో కూడా బాలయ్య మరోసారి డ్యూయల్ రోల్ చేయబోతున్నారు. పాన్ ఇండియా సినిమాగా రాబోతోన్న ఈ మూవీని భారీ బడ్జెట్ తో చాలా గ్రాండ్ గా తీయబోతున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ నుంచి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.