ఘనంగా తారకరత్న కూతురి హాఫ్ శారీ ఫంక్షన్..

ఘనంగా తారకరత్న కూతురి హాఫ్ శారీ ఫంక్షన్..

గత ఏడాది టాలీవుడ్ ప్రముఖ హీరో నందమూరి తారకరత్న ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో హాస్పిటల్ లో చేరి మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా నందమూరి ఫ్యామిలీ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. తారకరత్న మరణాంతరం అతడి భార్య అలేఖ్య రెడ్డి అన్నీ తానై తన పిల్లలని చూసుకుంటోంది. అయితే తారకరత్న, అలేఖ్యలకి ముగ్గరు సంతానం.

ALSO READ | ఇదేందయ్యా ఇది: అక్టోబర్ 25 బాలయ్య పండుగనా.. ఇదెప్పుడు పెట్టారు..?

ఇందులో పెద్దకూతురు నిష్క హాఫ్ సారీ ఫంక్షన్ ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ ఫంక్షన్ కి పలువురు కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరై నిష్క ని ఆశీర్వదించారు. కాగా అలేఖ్య రెడ్డి ఈ ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.