నాని రూ.100 కోట్ల వసూళ్ల తాండవం.. పోయారు మొత్తం పోయారు

నాని రూ.100 కోట్ల వసూళ్ల తాండవం.. పోయారు మొత్తం పోయారు

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram). దర్శకుడు వివేక్ ఆత్రేయ (Vivek Athreya) తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియాంక మొహనన్ (Priyanka Mohanan) హీరోయిన్ గా నటించింది.

ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య (DVV Danayya) నిర్మించిన ఈ సినిమా తెలుగుతో పాటు,తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గురువారం (ఆగస్ట్ 29న) థియేటర్లలలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వసూళ్ల తాండవం చూపించింది.

ALSO READ : Kalinga: నాలాంటి కొత్త వ్యక్తి సినిమా తీసి..హిట్ కొట్టడం మామూలు విషయం కాదు: హీరో, డైరెక్టర్ ధృవ వాయు

ఈ మేరకు తాజాగా సరిపోదా శనివారం మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల వసూళ్లను సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. "ఇప్పుడు సరిపోయింది..కృతజ్ఞతలు చెప్పను ఎందుకంటే మీరందరూ కుటుంబ సభ్యులలా నిలబడి బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల బ్యాంగ్‌తో గీతను దాటేలా చూసుకున్నారు. చివరగా పోయారు మొత్తం పోయారు"అంటూ మేకర్స్ కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ సినీ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు 

ఈ చిత్రం మూడవ వారాంతంలో కూడా కొన్ని థియేటర్లలో తన హవాను కొనసాగిస్తోంది. దీంతో ‘దసరా సినిమా తర్వాత’ 100 కోట్ల మైలురాయిని చేరుకున్న నాని రెండో చిత్రంగా ‘సరిపోదా శనివారం’ నిలిచింది. ఇకపోతే దసరా, హాయ్‌ నాన్న చిత్రాలు మంచి వసూళ్లతో పాటు తాజాగా పలు విభాగాల్లో సైమా-2024 అవార్డులను కూడా సొంతం చేసుకోవడం గమనార్హం.

  • Beta
Beta feature