
నారాయణపేట, వెలుగు: విద్యార్ధులు డిజిటల్ లెర్నింగ్పై అవగాహన పెంచుకోవాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. గురువారం మండలంలోని జాజాపూర్ హైస్కూల్లో 9వ తరగతి చదివే పిల్లలకు, డిజిటల్ లెర్నింగ్ శిక్షణ పొందిన విద్యార్థులు ఇస్తున్న ప్రెజెంటేషన్ చూసి వారిని కలెక్టర్ ప్రశంసించారు.
గూగుల్ టూల్స్, ఈ మెయిల్, వివిధ యాప్స్ వినియోగంతో స్కూల్ ప్రాజెక్టులు చేయడం బాగుందని, గ్రామీణ విద్యార్థులకు ఇలా డిజిటల్ వినియోగంపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. డిజిటల్ ఈక్విటీ సంస్థ ప్రతినిధి ఓంకార్, డిగ్రీ కాలేజీ సెంటర్ విద్యార్థులను అభినందించారు. అన్ని టాపిక్స్పై ట్రైనింగ్ తీసుకోవడం హర్షణీయమన్నారు. డీఈవో గోవిందరాజులు, ఎస్ వో సాగర్ పాల్గొన్నారు.