మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam tej) నటిస్తోన్న తాజా చిత్రం గాంజా శంకర్(Gaanja Shankar) సినిమాకు నోటీసులు పంపారు యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు. ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియో గంజాయిని ప్రోత్సహించే విధంగా ఉందని నోటీసుల్లో పేర్కొన్నారు, సినిమాలో హీరో గంజాయి అమ్మే యువకుడిగా కనిపిస్తు్ండటం, అలాంటి సీన్స్ చూస్తే.. స్టూడెంట్స్, యూత్ వాటికి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి .. వెంటనే సినిమా టైటిల్ మార్చాలని చిత్ర యూనిట్ కు సూచించారు. అంతేకాకుండా సినిమాలో కూడా గంజాయికి సంబంధించిన సన్నివేశాలు ఉంటే ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Director @TS_NAB Issued Notice to #GANJASHANKAR film Crew raising objection over title & content depicting character as Ganja business, its glorification. Request film fraternity sensitize the concerned to refrain from glorifying sale, consume etc, of NDPS Substance.@TelanganaDGP pic.twitter.com/ImW927lKYV
— Telangana Anti Narcotics Bureau (@TS_NAB) February 17, 2024
ఇక గాంజా శంకర్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారని సమాచారం. భీమ్స్ సిసిరీలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. తాజాగా నార్కోటిక్ బ్యూరో పోలీసులు ఇచ్చిన నోటీసులతో మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.