Raj tarun, Lavanya: రాజ్ తరుణ్, లావణ్య ఇష్యూపై నార్సింగి సీఐ హరికృష్ణ రిపోర్ట్

Raj tarun, Lavanya: రాజ్ తరుణ్, లావణ్య ఇష్యూపై నార్సింగి సీఐ హరికృష్ణ రిపోర్ట్

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై అతని ప్రియురాలు లావణ్య ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే, తనను పెళ్లిచేసుకుంటా అని మోసం చేసి ఇప్పుడు మరో అమ్మాయితో తిరుగుతున్నాడని, తనను పట్టించుకోవడం లేదని నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఆమె. ఎలాగైనా తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. 

ఇదే విషయంపై నార్సింగి సీఐ హరికృష్ణ వివరణ ఇచ్చారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. లావణ్య అనే యువతీ హీరో రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేశారు. గత కొన్నేళ్లుగా రాజ్ తరుణ్ తో రిలేషన్ లో ఉన్నానని, గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాం అని, ఇప్పుడు తనని వదిలేసి వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని ఫిర్యాదు చేసిందని వివరించారు సీఐ హరికృష్ణ. 

ఇక యువతీ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామని, ఎవిడెన్స్ సేకరించాల్సి ఉంటుందని, ఆ తరువాతనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. అవసరం అనుకుంటే రాజ్ తరుణ్ ని కూడా స్టేషన్ కు పిలిచి విచారిస్తామని చెప్పారు. ఒకవేళ రాజ్ తరుణ్ కూడా ఫిర్యాదు చేస్తే.. రెండు ఫిర్యాదులను కూడా పరిగణంలోకి తీసుకొని విచారణ చేపడతామని చెప్పుకొచ్చారు సీఐ హరికృష్ణ.