రాజ్ తరుణ్ కేసు: లావణ్యకు షాకిచ్చిన పోలీసులు..

రాజ్ తరుణ్ కేసు: లావణ్యకు షాకిచ్చిన పోలీసులు..

హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ అతడి గర్ల్ ఫ్రెండ్ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసు విషయంలో నార్సింగి పోలీసులు లావణ్యకే షాక్ ఇచ్చారు.రాజ్ తరుణ్ పై ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలంటూ లావణ్యకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. 91సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు పోలీసులు. అయితే, లావణ్య ఇప్పటివరకు పోలీసులకు అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది.

రాజ్ తరుణ తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, తనని కాకుండా ఇంకొక హీరోయిన్ని పెళ్లి చేసుకున్నాడంటూ లావణ్య ఫిర్యాదు చేయటం టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో దుమారం రేపింది. లావణ్య ఆరోపణలపై స్పందించిన రాజ్ తరుణ్ లావణ్యతో రిలేషన్ పై క్లారిటీ ఇచ్చారు.

లావణ్యతో గతంలో రిలేషన్లో ఉన్నది వాస్తవమే అయినా కొన్నాళ్ల తర్వాత ఆమె ప్రవర్తన నచ్చక దూరంగా ఉంటున్నానని అన్నారు. అంతే కాకుండా లావణ్య డ్రగ్స్ వాడేదని, మస్తాన్ సాయి అనే యువకుడితో రిలేషన్లో ఉండేదని అన్నారు.