
తొమ్మిది నెలలుగా ఐఎస్ఎస్ లో ఉంటున్న సునీత ,బారీవిల్ మోర్ భూమి మీదకు వచ్చేందుకు లైన్ క్లియర్ అయ్యింది. నాసా స్పేస్ ఎక్స్ క్రూ 10 మిషన్ విజయవంతంగా ఐఎస్ఎస్ తో అనుసంధానం అయ్యింది. మార్చి16, ఉదయం 9.37 గంటలకు అనుసంధానం అయినట్లు నాసా వెల్లడించింది. నాసా వీడియోను తన ఎక్స్ లో పోస్ట్ చేసింది.
మార్చి 15 ఉదయం 4:35 గంటలకు ఫాల్కన్ 9 రాకెట్ కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ లో నలుగురు వ్యోమగాముల - అన్నే మెక్క్లెయిన్ ,నికోల్ అయర్స్, టకుయా ఒనిషి (జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ) , రోస్కోస్మోస్ వ్యోమగామి కిరిల్ పెస్కోవ్ ఉన్నారు. మార్చి 19 న విలియమ్స్ అంతరిక్షం నుంచి బయల్దేరనుంది. వీలైతే మరో వారం రోజుల్లో ఆమె భూమి మీదకు వచ్చే అవకాశం ఉంది.
2024 జూన్లో ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్, నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్ మిషన్ క్రూ 9 ప్రాజెక్ట్లో భాగంగా బోయింగ్ స్టార్లైనర్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు. నాసా షెడ్యూల్ ప్రకారం స్పేస్లో వీరి పర్యటన వారం రోజులు. కానీ.. వీరు వెళ్లిన బోయింగ్ స్టార్లైనర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నిక్ హేగ్, అలెగ్జాండర్ తిరిగి భూమి పైకి రాగా.. సునీత, బచ్ విల్మోర్ అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు.
వీరిని తిరిగి భూమీ మీదకు తీసుకొచ్చేందుకు నాసా పలుమార్లు ప్రయత్నించగా.. ఆ ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. దీంతో సునీతా, బచ్ విల్మోర్ 9 నెలలుగా అంతరిక్షంలోనే ఉన్నారు. అప్పటి నుంచి భూమి పైకి వచ్చేందుకు వెయిట్ చేస్తున్నారు
Docking confirmed! pic.twitter.com/zSdY3w0pOS
— SpaceX (@SpaceX) March 16, 2025