నస్పూర్ మున్సిపల్​ కమిషనర్ రమేశ్ ​సస్పెన్షన్​

 నస్పూర్ మున్సిపల్​ కమిషనర్ రమేశ్ ​సస్పెన్షన్​

మంచిర్యాల, వెలుగు: నస్పూర్​ మున్సిపల్​కమిషనర్​గా పనిచేసిన తన్నీరు రమేశ్​సస్పెండయ్యారు. అక్రమంగా బిల్డింగ్​ పర్మిషన్​ జారీ చేసినందుకు ఆయనను సస్పెండ్​ చేస్తూ మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన్​ జాయింట్ ​డైరెక్టర్​ మంగళవారం ఆర్డర్స్​ జారీ చేశారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ కమిషనర్​గా ఉన్న రమేశ్.. అంతకుముందు నస్పూర్ లో పని చేశారు. ఫిబ్రవరి 1 నుంచి 14 వరకు మెడికల్​ లీవ్​లో వెళ్లారు. 

లీవ్​లో ఉండగానే 13న చేర్యాలకు ట్రాన్స్​ఫర్​ అయ్యారు. కానీ, 14న సాయంత్రం 5.30 నుంచి రాత్రి 11 గంటల మధ్య హడావుడిగా తొమ్మిది బిల్డింగులకు పర్మిషన్లు ఇచ్చారు. ఈ విషయాన్ని ‘వెలుగు’ బయటపెట్టింది. ‘అర్ధరాత్రి హౌస్​ పర్మిషన్లు’ పేరుతో ఫిబ్రవరి 18న స్టోరీ పబ్లిష్​ చేసింది. స్పందించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. వరంగల్ రీజినల్​ డైరెక్టర్ ​ఎంక్వైరీ జరిపారు. 9 పర్మిషన్లలో రెండింటిని టీపీఎస్ ​రెకమండ్ ​చేయకుండానే అప్రూవ్​ చేసినట్టు గుర్తించారు. అలాగే కలెక్టర్​ సంతోష్​ మంచిర్యాల ఆర్డీఓతో ఎంక్వైరీ జరిపించి రిపోర్ట్​ ఇచ్చారు. దీంతో రమేశ్​ను సస్పెండ్ ​ చేశారు.