
మంచిర్యాల, వెలుగు: నస్పూర్ మున్సిపల్కమిషనర్గా పనిచేసిన తన్నీరు రమేశ్సస్పెండయ్యారు. అక్రమంగా బిల్డింగ్ పర్మిషన్ జారీ చేసినందుకు ఆయనను సస్పెండ్ చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ మంగళవారం ఆర్డర్స్ జారీ చేశారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ కమిషనర్గా ఉన్న రమేశ్.. అంతకుముందు నస్పూర్ లో పని చేశారు. ఫిబ్రవరి 1 నుంచి 14 వరకు మెడికల్ లీవ్లో వెళ్లారు.
లీవ్లో ఉండగానే 13న చేర్యాలకు ట్రాన్స్ఫర్ అయ్యారు. కానీ, 14న సాయంత్రం 5.30 నుంచి రాత్రి 11 గంటల మధ్య హడావుడిగా తొమ్మిది బిల్డింగులకు పర్మిషన్లు ఇచ్చారు. ఈ విషయాన్ని ‘వెలుగు’ బయటపెట్టింది. ‘అర్ధరాత్రి హౌస్ పర్మిషన్లు’ పేరుతో ఫిబ్రవరి 18న స్టోరీ పబ్లిష్ చేసింది. స్పందించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. వరంగల్ రీజినల్ డైరెక్టర్ ఎంక్వైరీ జరిపారు. 9 పర్మిషన్లలో రెండింటిని టీపీఎస్ రెకమండ్ చేయకుండానే అప్రూవ్ చేసినట్టు గుర్తించారు. అలాగే కలెక్టర్ సంతోష్ మంచిర్యాల ఆర్డీఓతో ఎంక్వైరీ జరిపించి రిపోర్ట్ ఇచ్చారు. దీంతో రమేశ్ను సస్పెండ్ చేశారు.