ఫిబ్రవరి10న అప్రెంటిషిప్ మేళా

ఫిబ్రవరి10న అప్రెంటిషిప్ మేళా

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ ప్రభుత్వ పారిశ్రామిక సంస్థ ఐటీఐలో ఫిబ్రవరి10న ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఆర్.నరేంద్రబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కంపెనీలు ఇందులో పాల్గొంటాయని, ఐటీఐ ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మేళాకు  వచ్చేవారు పదో తరగతి, ఐటీఐ మార్క్స్ మెమో, కుల ధ్రువీకరణ సర్టిఫికేట్ తోపాటు పూర్తి వివరాలతో బయోడేటా ఫారాన్ని వెంట తెచ్చుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం 9177472488 ను  సంప్రదించాలన్నారు.