
హైదరాబాద్ లో ఫ్రిబ్రవరి 9 నుంచి నేషనల్ బుక్ ఫెయిర్ జరగనుంది. ఎన్టీఆర్ స్టేడియంలో ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు బుక్ ఫెయిర్ ఉంటుంది. పలు భాషల్లో పలు అంశాలకు సంబంధిన అనేక రకాల పుస్తకాలను ప్రదర్శిస్తారు. మొదటి బుక్ ఫెయిర్ 1985లో అశోక్ నగర్ లోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో జరిగింది.
జనవరి 8న బుక్ ఫెయిర్ ఆఫీస్ లో అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో నూతన బుక్ ఫెయిర్ సెక్రటరీగా ఆర్ వాసు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా 36వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ తేదీలను కార్యవర్గ సభ్యులు ఖరారు చేశారు. ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు ప్రతి ఏటా జరిగే ఎన్టీఆర్ స్టేడియంలోనే ఈసారి కూడా ఉంటుందని, పుస్తక ప్రియులకు పాఠకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కోశాధికారి పి రాజేశ్వరరావు, మాజీ కార్యదర్శి శృతికాంత్ భారతి, ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి, కోయ చంద్రమోహన్ లు, సహయ కార్యదర్శి శోభన్ బాబు, జనార్థన్ గుప్తా, కవి యాకూబ్, శ్రీకాంత్, బాల్ రెడ్డి పాల్గొన్నారు.