
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులోఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్ లో కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, సోనియాగాందీ పేర్లు ఉన్నాయి. కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ సామ్ పిట్రోడా, సుమన్ దూబేలతో పాటు ఈ కేసుతో సంబంధమున్న సంస్థలు, మరికొంత పేర్లు చేర్చారు. గాంధీ కుటుంబంపై ఇది తొలి ఛార్జ్షీట్.ఈ కేసులో ఏప్రిల్ 25న కోర్టు విచారణ చేపట్టనుంది.మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 లోని సెక్షన్ 44,45 ,సెక్షన్ 3 ,4, సెక్షన్ 70 కింద నేరానికి పాల్పడినందుకు ప్రాసిక్యూషన్ ఫిర్యాదును ఈడీ దాఖలు చేసింది.
ఏంటీ నేషనల్ హెరాల్డ్ కేసు..?
ఏజేఎల్, దాని యాజమాన్య కంపెనీ యంగ్ ఇండియన్ కంపెనీపై మనీ లాండరింగ్ కేసు ఇది. నేషనల్ హెరాల్డ్ కేసుగా ప్రచారంలో ఉంది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు పబ్లిషర్స్గా ఏజేఎల్ ఉండగా, యంగ్ ఇండియన్లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి 38 శాతం చొప్పున మెజారిటీ షేర్లు ఉన్నాయి. కాంగ్రెస్కు ఏజేఎల్ బకాయి పడిన రూ.90 కోట్లను వసూలు చేసుకునే విషయంలో యంగ్ ఇండియన్లో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపిస్తున్నది.ఇప్పటికే ఈ కేసులో సోనియా, రాహుల్ లకు సంబంధమున్న ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు జారీ చేసింది.
రాహుల్, సోనియాగాంధీ మెజారిటీ వాటాదారులుగా ఉన్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL),యంగ్ ఇండియన్ లిమిటెడ్కు సంబంధించిన ఆర్థిక అవకతవకలపై ఈడీ కేసు నమోదు చేసింది. యంగ్ ఇండియన్, AJL ఆస్తులను కూడబెట్టేందుకు నేరపూరిత కుట్ర,నిధుల దుర్వినియోగం జరిగినట్లు ED ఆరోపించింది.