
- జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి ఉమా శంకర్ కు వినతిపత్రం అందజేత
సిద్దిపేట, వెలుగు: సూర్యాపేట నుంచి సిద్దిపేట మీదుగా సిరిసిల్లకు వెళ్లే 365బీ నేషనల్ హైవే అలైన్మెంట్మార్పునకు నేషనల్ హైవే అథారిటీ అధికారులు సానుకూలంగా స్పందించారు. రైతులకు ఊరటనిచ్చే విధంగా కొత్త అలైన్మెంట్పరిశీలనకు అంగీకరించారు. రైతుల తరఫున ఎంపీ రఘునందన్ రావు రైతుల ప్రతినిధి బృందాన్ని మంగళవారం ఢిల్లీకి తీసుకెళ్లారు. జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి ఉమా శంకర్ను కలిసి రైతులు నష్టపోకుండా చూడాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
రైతులు భూములు కోల్పోకుండా రాజీవ్ రహదారి, సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానం చేస్తే ఎవరికీ నష్టం జరగదని కొత్త అలైన్మెంట్ మార్గాన్ని ఎంపీ అధికారుల మందు ప్రతిపాదించారు. ఈ అంశంపై అధికారులు స్పందించి పాత అలైన్మెంట్ జరుగుతున్న భూ సర్వేను నిలిపివేసి కొత్త అలైన్మెంట్ప్రతిపాదిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ రఘునందన్ రావు ప్రయత్నాన్ని రైతులు అభినందించారు. ఆయన వెంట రైతులు రాంరెడ్డి, నర్సింలు, సందీప్ రావు, తిరుపతి, రాజలింగం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్, సంతోష్ పాల్గొన్నారు.