
మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అన్నారం జడ్పీ హైస్కూల్స్టూడెంట్, జాతీయ ఇన్స్పైర్అవార్డు గ్రహీత మణిప్రసాద్ కు అరుదైన అవకాంశం దక్కింది. జపాన్లో వచ్చే మే నెలలో నిర్వహించే సకురా సైన్స్ హైస్కూల్ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు మణిప్రసాద్కు ఆహ్వానం అందిందని డీఈఓ ఎస్.యాదయ్య తెలిపారు. నూతన సాంకేతికతను తెలుసుకొని మరిన్ని ఆవిష్కరణలు చేయడానికి ఆ ప్రోగ్రాం ఉపయోగపడుతుందన్నారు.
మణిప్రసాద్ గత అక్టోబర్లో ఢిల్లీలో నిర్వహించిన జాతీయ ఇన్స్పైర్ పోటీల్లో ప్రతిభ చాటి సెంట్రల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ డాక్టర్ జితేందర్ సింగ్ తోమర్ చేతుల మీదుగా జాతీయ అవార్డును అందుకున్నాడు. ఈ సందర్భంగా మణిప్రసాద్, గైడ్ సురేందర్, హెచ్ఎం రమేశ్ను డీఈఓ యాదయ్య, సెక్టోరల్ కో ఆర్డినేటర్ చౌదరి, జిల్లా సైన్స్ ఆఫీసర్ మధుబాబు అభినందించారు.