ఎంపికైనవారికి ప్రతి నెలా రూ. 1000 స్కాలర్ షిప్

ఎంపికైనవారికి ప్రతి నెలా రూ. 1000 స్కాలర్ షిప్

ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం నేషనల్​ మీన్స్​ కమ్​ మెరిట్​ స్కాలర్​షిప్ నోటిఫికేషన్​ రిలీజ్​ అయింది.  ఎంపికైనవారికి తొమ్మిది నుంచి ఇంటర్‌‌‌‌ వరకు కేంద్ర మానవ వనరుల విభాగం ప్రతి నెలా రూ. 1000 చొప్పున అందిస్తారు. వీటికి ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3.5 లక్షలకు మించరాదు.

రాష్ట్రాల వారీగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇందుకోసం  రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తాయి. లక్ష స్కాలర్‌‌‌‌షిప్పులను రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన విభజించారు. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌‌‌‌కు 4,087, తెలంగాణకు 2,921 కేటాయించారు.

ఎగ్జామ్​ ప్యాటర్న్: పరీక్ష 180 మార్కులకు ఉంటుంది. ఇందులో రెండు భాగాలు ఉంటాయి. పార్ట్‌‌‌‌-1 మెంటల్‌‌‌‌ ఎబిలిటీ టెస్ట్​, పార్ట్‌‌‌‌-2 స్కాలస్టిక్‌‌‌‌ ఆప్టిట్యూడ్‌‌‌‌ టెస్టు (ఎస్‌‌‌‌ఏటీ) ఉంటుంది. ఈ పరీక్షలో అర్హత సాధించడానికి రెండు విభాగాల్లోనూ కనీసం 40 (ఎస్సీ, ఎస్టీలు 32) శాతం మార్కులు రావాలి. జనరల్‌‌‌‌ అభ్యర్థులైతే ప్రతి పేపర్‌‌‌‌లోనూ 36, ఎస్సీ, ఎస్టీలకు 29 చొప్పున మార్కులు సాధించాలి. ఈ ఉపకార వేతనం కొనసాగాలంటే ప్రతి తరగతిలోనూ నిర్దేశిత మార్కులు సాధించడం తప్పనిసరి. వీరు పదో తరగతిలో కనీసం 60 (ఎస్సీ, ఎస్టీలు 55) శాతం పొందితేనే స్కాలర్‌‌‌‌షిప్పు కొనసాగుతుంది.

దరఖాస్తులు: ఏపీలో ఈ ప్రకటన వెలువడింది. దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. తెలంగాణలో కొద్ది రోజుల్లో వెలువడుతుంది. ఏపీలో అక్టోబర్ 31 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ అభ్యర్థులు వివరాలకు www.bse.telangana.gov.in వెబ్​సైట్​ సంప్రదించాలి.