బాచుపల్లిలో నకిలీ మహిళా డాక్టర్ .. ఎలాంటి అర్హత లేకున్నా అబార్షన్స్ చేస్తున్న వైనం!

బాచుపల్లిలో నకిలీ మహిళా డాక్టర్ .. ఎలాంటి అర్హత లేకున్నా అబార్షన్స్ చేస్తున్న వైనం!
  • నేషనల్ మెడికల్​ కౌన్సిల్​ సభ్యుల తనిఖీల్లో బయటపడ్డ బాగోతం
  • మరో ఐదుగురిపై కేసులు

 జీడిమెట్ల, వెలుగు: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్లినిక్​లపై నేషనల్​ మెడికల్ ​కౌన్సిల్​సభ్యులు కొరడా ఝళిపిస్తున్నారు. శుక్రవారం నిజాంపేటలో 2, మల్లంపేటలో 4 క్లినిక్స్​లో తనిఖీలు చేశారు. ఎలాంటి విద్యార్హతలు లేకుండా హాస్పిటళ్ల​ పేరుతో బోర్డులు పెట్టి, వీటిల్లో ప్రమాదకరమైన యాంటీ బయోటిక్స్, స్టెరాయిడ్స్, పెయిన్​ కిల్లర్లను ​రోగులకు ఇస్తున్నట్లు గమనించారు. బాచుపల్లిలోని బుచ్చిబాబు క్లినిక్​లో అరుణ కుమారి అనే ఒక మహిళ పదో తరగతి కూడా పాస్ ​కాకుండా లెటర్​ ప్యాడ్​పై  డాక్టర్​ అని రాసుకుని వైద్యం చేస్తుండడాన్ని గుర్తించారు. 

ఈమె ఏకంగా మహిళలకు అబార్షన్స్ కూడా చేస్తున్నట్లు సమాచారం సేకరించారు. ఈ సందర్భంగా మెడికల్ కౌన్సిల్ ​వైస్​చైర్మన్​ డా.శ్రీనివాస్​ మాట్లాడుతూ.. నిబంధనలు పాటించని క్లినిక్​లపై క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 400 కేసులు  నమోదు చేశామని హైదరాబాద్​లో 150 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.  తనిఖీల్లో తెలంగాణ కమిటీ సభ్యులు ఇమ్రాన్, విష్ణు తదితరలు పాల్గొన్నారు.