ప్రతీ భారతీయుడు సంబరాలు చేసుకుంటున్నాడు

ప్రతీ భారతీయుడు సంబరాలు చేసుకుంటున్నాడు

తిరుమల:  ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి భారతీయ పౌరుడు సంబరాలు చేసుకుంటున్నారని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ నందకుమార్ సాయి అన్నారు. ఇవాళ ఉదయం ఆయన తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్న ఆయనకు ఆలయ అధికారుకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం చేయగా…. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసీ పట్టువస్త్రంతో సత్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నందకుమార్ సాయి..370 రద్దు పరిణామంతో ఎస్టీ కమిషన్ కార్యకలాపాలు విస్తృతం అయ్యాయని.., జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యాం ముఖర్జీ అఖండ భారత్ కల నెరవేరిందని అన్నారు.