​పసుపు పేరిట పాలిటిక్స్ వద్దు

​పసుపు పేరిట పాలిటిక్స్ వద్దు
  • రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుందాం..
  • జాతీయ పసుపు బోర్డు చైర్మన్​ పల్లె గంగారెడ్డి​ 

నిజామాబాద్, వెలుగు: పసుపు రైతుల మాటున రాజకీయాలు చేయడం ఆపాలని నేషనల్​ టర్మరిక్​ బోర్డు చైర్మన్​ పల్లె గంగారెడ్డి కోరారు.  మంగళవారం నగరంలోని వేణుమాల్​ కన్వెన్షన్ సెంటర్​లో పసుపు బోర్డు ఆధ్వర్యంలో ట్రేడర్లు, రైతులతో జరిగిన మీటింగ్లో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ ఆలోచన మేరకు సంక్రాంతి పండగ రోజు జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటైందన్నారు. ఓపెనింగ్​ ఈవెంట్​ను కలెక్టరేట్​లో చేయాలని కలెక్టర్​ రాజీవ్​గాంధీని కోరగా స్పందించలేదన్నారు.

 అందుకే హోటల్​లో ఏర్పాటు చేయాల్సి వచ్చిందని, కొందరు లీడర్లు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు ఎన్ని విధాల వాడే వీలుందో రీసెర్చ్​ చేస్తామన్నారు. దేశంలో 7 లక్షల ఎకరాల్లో పసుపు సాగవుతుండగా 2 లక్షల ఎకరాల పంటతో మహారాష్ట్ర టాప్​లో ఉందన్నారు. తరువాత ఒడిశా, తమిళనాడు, ఏపీ ఉన్నాయన్నారు.  సమావేశంలో బోర్డు సెక్రటరీ భవానీ, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్,​ మార్కెట్​ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్​ తదితరులు పాల్గొన్నారు.