రూ.6,66,66,666తో అమ్మవారికి అలంకరణ

రూ.6,66,66,666తో అమ్మవారికి అలంకరణ

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ టౌన్‌‌‌‌, వెలుగు : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లా కేంద్రంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని ఆదివారం ప్రత్యేకంగా అలంకరించారు. ఆర్య వైశ్య పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రూ.6,66,66,666 నోట్లతో అమ్మవారిని ముస్తాబు చేశారు. నోట్లను పూలదండలుగా, తోరణాలుగా తయారుచేసి అమ్మవారికి అలంకరణ చేశారు. ధనలక్ష్మి అలంకరణలో ఉన్న అమ్మవారిని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.