50 సెకన్ల యాడ్ కోసం రూ.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్. 

50 సెకన్ల యాడ్ కోసం రూ.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్. 

తెలుగు, తమిళ్, హిందీ తదితర భాషల్లో హీరోయిన్ గా నటించి ఆడియన్స్ ని ఎంతగానో అలరించిన ప్రముఖ నటి నయనతార గురించి పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. నయనతార ఈమధ్య సోలో లీడ్ పాత్రలు చేస్తూ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా నటిస్తోంది. అయితే పెళ్లయిన తర్వాత కూడా నయనతార వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలో నయనతార సినిమా బడ్జెట్ ని బట్టి దాదాపుగా 10 నుంచి 15 కోట్ల రూపాయలు పారితోషకం అందుకుంటోంది. 

ఐతే ఇటీవలే  నయనతార కి ప్రముఖ డీటిహెచ్ సంస్థ అయిన టాటా స్కై ని ప్రమోట్ చేసే ప్రకటనలో నటించే ఆఫర్ వచ్చింది. దీంతో నయనతార 50 సెకన్ల ప్రకటనలో నటించింది. అయితే ఈ 50 సెకెన్ల టాటా స్కై ప్రకటన కోసం దాదాపుగా రూ.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. దీంతో హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ గా  నయనతార రికార్డ్ క్రియేట్ చేసింది. 

ALSO READ | టాలీవుడ్ లో హీరోలను దేవుళ్ళలా చూస్తారు: సైఫ్ అలీ ఖాన్

ఈ విషయం ఇలా ఉండగా నటి నయనతార ఆ మధ్య బాలీవుడ్ లో ప్రముఖ డైరెక్టర్ అట్లీ కుమార్ మరియు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లో తెరకెక్కిన జవాన్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కాగా ప్రస్తుతం హిందీ, తమిళ్, తెలుగు తదితర భాషలలో దాదాపుగా 5కి పైగా చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.