నయన్కి విఘ్నేశ్ పెద్ద అభిమాని. అమె కంటే అతను వయసులో ఒక ఏడాది చిన్న కూడా.. విఘ్నేష్ కేవలం దర్శకుడు మాత్రమే కాదు మల్టీ టాలెంటెడ్. పాటల రచయతగా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి.. తమిళ్ లో 50 కి పైగా పాటలు రాశారు. పలు ఆల్బమ్స్ కి మ్యూజిక్ కూడా చేశాడు.
2012లో శింబు హీరోగా వచ్చిన పోడా పోడి సినిమాకి విఘ్నేష్ కు మొదటిది. అతని రెండో సినిమా అయిన 2015లో వచ్చిన ’నానుమ్ రౌడీదాన్’ (Naanum Rowdy)సినిమాలో తొలిసారి నయన్ నటించింది. తెలుగులో ‘నేను రౌడినే’ టైటిల్ తో రిలీజై మంచి విజయాన్ని సాధించింది.
ఈ నేపథ్యంలో 'నేను రౌడినే’ మూవీ రిలీజై 9ఏళ్లు పూర్తి చేసుకోవడంతో నయన్ స్పెషల్ పోస్ట్ చేశారు. ‘నా జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన చిత్రం నేను రౌడినే. నా కెరీర్ను గొప్పగా మలచిన సినిమా ‘నేను రౌడినే’. 9ఏళ్ల కిత్రం రిలీజై బాక్సాఫీస్ హిట్ కొట్టింది. అయితే విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా మర్చిపోలేని అనుభూతుల్ని అందించిందని తెలిపారు. ఈ విషయంలో ఆడియన్స్ కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇలాంటి గొప్ప సినిమాలో అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ విఘ్నేశ్కు కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేసింది. అంతేకాకుండా ఈ సినిమా నాకు విఘ్నేశ్ను (నయన్ భర్త) ఇచ్చింది’’ అని పోస్ట్ లో రాసుకొచ్చింది.
Also Read : అఫిషియల్: కార్తీ బ్లాక్బస్టర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ చూడాలంటే?
విఘ్నేశ్ శివన్ కూడా ఎన్నోసార్లు నయన్ వల్లే ఈ సినిమా ఇంత బాగొచ్చిందని.. హీరో ధనుష్.. నయన్ హీరోయిన్ గా చేస్తే బాగుంటుందని చెప్పారు. అందువల్లే తనతో షూటింగ్ చేసిన ఆ ఏడాదంతా ఆమెతో ఉండే అవకాశం వచ్చిందని..దాంతో నయన్ ఇష్టాయిష్టాలను తెలుసుకునే సమయం దొరికిందని' పలుమార్లు విఘ్నేశ్ వెల్లడించారు.
ఇకపోతే.. విఘ్నేశ్ శివన్ను ప్రేమించి 2022 జూన్ 9న మహాబలిపురంలో పెళ్లి చేసుకుంది నయన్. వారికి ఇద్దరు పిల్లలు ఉయిర్, ఉలగం అనే కవల పిల్లలు ఉన్నారు. వీరిద్దరూ కూడా సరోగసీ ద్వారా జన్మించారు.
ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె.. ప్రస్తుతం ఆమె ది టెస్ట్(The Test) అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో సిద్దార్థ్, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మలయాళం సినిమాలో నటిస్తోంది. కొత్త దర్శకులు సందీప్ కుమార్, జార్జ్ ఫిలిప్ దర్శకత్వంలో డియర్ స్టూడెంట్స్ అనే చిత్రంలో నటిస్తోంది.
#WikkiNayan 🫶🏻 pic.twitter.com/bZjzuLKsCW
— Nayanthara✨ (@NayantharaU) October 10, 2024