
కౌడిపల్లి, వెలుగు : పటాన్ చెరు బీఆర్ఎస్ టికెట్పై సీఎం కేసీఆర్ పునరాలోచించుకోవాలని పటాన్ చెరు మండలం చిట్కుల్ సర్పంచ్, బీఆర్ఎస్ రాష్ట్ర లీడర్ నీలం మధు అన్నారు. ఆదివారం కౌడిపల్లి మండలం వెంకట్రావ్ పేట నుంచి మండల కేంద్రమైన కౌడిపల్లి వరకు ముదిరాజ్లు 200 బైక్లతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా హాజరైన మధును ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జనాభా పరంగా అధిక శాతంగా ఉన్న ముదిరాజ్లకు న్యాయం చేయాలని, ఎన్నికల్లో నాలుగు సీట్లు కేటాయించాలని, అప్పుడే ఎన్నికల్లో గెలుపు సాధ్యమవుతుందని తెలిపారు. అనంతరం సదాశివపల్లిలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొని పూజలు చేశారు.