నేతాజీ మేనకోడలు రోమా రే కన్నుమూత

నేతాజీ మేనకోడలు రోమా రే కన్నుమూత
  • వృద్ధాప్య సమస్యలతో మృతి

కోల్​కతా: నేతాజీ సుభాష్ చంద్రబోస్ మేనకోడలు రోమా రే (95) వృద్ధాప్య సమస్యలతో బుధవారం మరణించారు. దక్షిణ కోల్ కతాలోని నివాసంలో ఆమె తుది శ్వాస విడిచారు. ఈమేరకు ఆమె కుమారుడు ఆశిష్​ రే ఓ ప్రకటనను విడుదల చేశారు. రోమా రే ప్రముఖ డాక్టర్ సచిస్ రేను పెళ్లి చేసుకున్నారు. ఆమెకు ఓ కొడుకు, ఇద్దరు కూతుళ్లు, ఐదుగురు మనుమలు ఉన్నారు. ప్రముఖ ఫ్రీడం ఫైటర్​, బారిస్టర్ శరత్ చంద్రబోస్ కుమార్తెనే రోమా రే.