
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రం శివారులో నిర్మించిన కొత్త బస్టాండ్ ప్రారంభానికి ఎదురు చూస్తోంది. 2017 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేయగా, రెండేండ్ల కింద నిర్మాణం పూర్తి చేశారు. ఇప్పటికీ బస్టాండ్ను ప్రారంభించకపోవడంతో నిరుపయోగంగా మారింది. ఇప్పుడు ఇలా సంచార జాతుల వారు ఇక్కడ సేద తీరుతున్నారు.
తాత్కాలిక బస్టాండ్ ప్రాంతంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ బస్సుల కోసం వేచి ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం ఎండకాలం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్షలు వెచ్చించి కొత్త బస్టాండ్ను నిర్మించినా ప్రారంభించకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. - మొగుళ్లపల్లి, వెలుగు