
మంచిర్యాల/నిర్మల్, వెలుగు: నిర్మల్, మంచిర్యాలకలెక్టర్లు బదిలీ అయ్యారు. వారి స్థానంలో ప్రభుత్వం కొత్తవారిని నియమించింది. నాగర్కర్నూల్అడిషనల్కలెక్టర్ (లోకల్బాడీస్)గా పనిచేస్తున్న కుమార్ దీపక్ను కలెక్టర్గా ప్రమోట్ చేస్తూ మంచిర్యాలకు ట్రాన్స్ఫర్ చేశారు.
ప్రస్తుత కలెక్టర్ బదావత్ సంతోష్ నాగర్కర్నూల్కు బదిలీ అయ్యారు. కొత్త కలెక్టర్ కుమార్ దీపక్ జిల్లాకు సుపరిచితులే. 2018 బ్యాచ్కు చెందిన ఆయన 2019–20లో జిల్లాలో ట్రెయినీ అసిస్టెంట్కలెక్టర్గా పనిచేశారు. ఇక నిర్మల్ జిల్లా కలెక్టర్గా అభిలాష అభినవ్ నియమితులయ్యారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో జోనల్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న ఆమెను నిర్మల్కు కలెక్టర్గా బదిలీ చేశారు. ఇక్కడి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను కామారెడ్డికి ట్రాన్స్ఫర్ చేశారు.