కొత్త కమిషనర్ల బాధ్యతల స్వీకరణ 

కొత్త కమిషనర్ల బాధ్యతల స్వీకరణ 

గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్​ డిప్యూటీ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నాయిని వెంకటస్వామి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.  మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇజల్లా డోర్నకల్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న ఆయనను రామగుండం బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మహ్మద్ నియాజ్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. కరీంనగర్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న ఆయనను ప్రభుత్వం సుల్తానాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన జిల్లా ఉన్నతాధికారులను కలిశారు.


సిరిసిల్ల టౌన్, వెలుగు: సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎస్.సమ్మయ్య బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన కమిషనర్ లావణ్య హైదరాబాద్ జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీకి బదిలీ అయ్యారు. సమ్మయ్య గతంలో హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పనిచేశారు.