న్యూఢిల్లీ రిచ్చెస్ట్​ రైల్వేస్టేషన్​ .. నాలుగో స్థానంలో సికింద్రాబాద్​

న్యూఢిల్లీ  రిచ్చెస్ట్​ రైల్వేస్టేషన్​ .. నాలుగో స్థానంలో సికింద్రాబాద్​

భారతీయ రైల్వేలకు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరుంది. ప్రపంచంలోనే నాల్గో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ అనే రికార్డు సైతం ఉంది. దేశ ప్రజలకు సైతం రైల్వే ప్రయాణాన్ని చాలా వరకు ఇష్టపడుతుంటారు.  ప్రతి సంవత్సరం రైల్వేస్టేషన్ల ఆదాయాన్ని రైల్వేశాఖ ప్రకటిస్తుంది.  2023–24 ఆర్థిక సంవత్సరంలో  ఎక్కువ ఆదాయం   పొందిన 100  రైల్వే స్టేషన్లలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్​ అగ్రస్థానంలో ఉంది.  పశ్చిమ బెంగాల్ లోని హౌరా స్టేషన్ రెండో స్థానంలో, చెన్నైలోని ఎంజీఆర్ సెంట్రల్ మూడో స్థానంలో ఉన్నాయి. ఇక నాలుగో స్థానంలో సికింద్రాబాద్​ స్టేషన్​ ఉందని రైల్వేశాఖ ప్రకటించింది. 

ఢిల్లీ రైల్వే స్టేషన్‌ నుంచి ఏటా భారతీయ రైల్వేకు రూ.3,337 కోట్ల ఆదాయం వస్తోంది. సంపాదన విషయంలో ఈ రైల్వే స్టేషన్ నంబర్ వన్ స్థానంలో ఉంది. హౌరా రైల్వే స్టేషన్ కు  రూ.1,692 కోట్ల వార్షిక ఆదాయం రాగా .. చెన్నై సెంట్రల్ రూ.1,299 కోట్లు వచ్చాయి. సికింద్రాబాద్​ స్టేషన్​ రూ.  1,276 కోట్లు సంపాందించి నాలుగో స్థానంలో ఉంది. అలాగే.. 500 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వస్తున్న రైల్వే స్లేషన్లు నాన్ సబర్బన్ గ్రూప్ 1 కేటగిరీ కింద చేర్చారు. ఈ జాబితాలో 28 రైల్వే స్టేషన్లు స్థానం దక్కించుకున్నాయి. 

ఇక ప్రయాణికుల సంఖ్య పరంగా పరిశీలిస్తే  ముంబైలోని థానే రైల్వే స్టేషన్ అగ్రస్థానంలో నిలిచింది.  2023–24 ఆర్ధిక సంవత్సరంలో  93.06 కోట్ల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ గుండా ప్రయాణించారు.  . ముంబైలోని కల్యాణ్ రైల్వే స్టేషన్ రెండో స్థానంలో ఉంది. ఏటా ఇక్కడి నుంచి 83.79 కోట్ల మంది ప్రయాణం చేస్తున్నారు. అలాగే.. న్యూఢిల్లీలోని రైల్వే స్టేషన్ నుంచి 39.36 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు.అలాగే సికింద్రాబాద్ కూడా ఈ జాబితాలో చోటు సాధించింది. దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ తరువాత ఎన్ఎస్‌జీ 1 హోదా విజయవాడ మాత్రమే సాధించింది. ఈ గుర్తింపుతో కేంద్రం ఈ స్టేషన్లకు మరిన్ని నిధులు కేటాయించనుంది. అలాగే.. ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.

2023–24 ఆర్థిక సంవత్సరంలో రైల్వేశా ప్రకటించిన ఆదాయం  వివరాలు

  • న్యూఢిల్లీ    .... రూ. 3,337 కోట్లు
  • హౌరా ( వెస్ట్​ బెంగాల్​)... రూ.  1,692 కోట్లు
  • చెన్నై సెంట్రల్​(తమిళనాడు)...రూ.  1,299కోట్లు
  • సికింద్రాబాద్( తెలంగాణ)..రూ.  1,276 కోట్లు
  • హజరత్​ నిజాముద్దీన్​( ఢిల్లీ).. రూ.  1,227 కోట్లు
  • లోకమాన్య తిలక్​ టెర్నినల్(ముంబై)​.. రూ.  1,036 కోట్లు
  • అహ్మదాబాద్​ ( గుజరాత్​) ..రూ.  1,010 కోట్లు
  • ముంబై సీఎస్​టీ (మహారాష్ట్ర) ..రూ.  982 కోట్లు

ప్రయాణికుల పరంగా ...

  • న్యూఢిల్లీ    .... 39,362, 272 మంది 
  • హౌరా ( వెస్ట్​ బెంగాల్​)...   61,329,319 మంది
  • చెన్నై సెంట్రల్​(తమిళనాడు)...30,599,837 మంది
  • సికింద్రాబాద్( తెలంగాణ). 27,776,937 మంది
  • హజరత్​ నిజాముద్దీన్​( ఢిల్లీ).. 14,537,686 మంది
  • లోకమాన్య తిలక్​ టెర్నినల్(ముంబై)​..14,680,379 మంది
  • అహ్మదాబాద్​ ( గుజరాత్​) .. 18,260,021 మంది
  • ముంబై సీఎస్​టీ (మహారాష్ట్ర) ..51, 652,230 మంది