
ముంబయిలో ప్రధాన కేంద్రంగా గల ప్రభుత్వ రంగ సంస్థ- న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్ఐఏసీఎల్ శాఖల్లో 300 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్ : ప్రాథమిక రాత పరీక్ష, ప్రధాన రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు : ఆర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు www.newindia.co.in వెబ్సైట్లో సంప్రదించాలి.