వచ్చే వారం కొత్త ఐటీ బిల్లు

వచ్చే వారం కొత్త ఐటీ బిల్లు

న్యూఢిల్లీ: కొత్త ఆదాయపు పన్ను బిల్లును వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశ పెడతామని మంత్రి నిర్మల ప్రకటించారు. దీనిని సులువుగా అర్థం చేసుకోవచ్చని, చట్టాలను మరింత సరళీకరిస్తామన్నారు. ఫేస్​లెస్​అసెస్​మెంట్​సహా గత పదేళ్లలో ట్యాక్స్​పేయర్ల కోసం ఎన్నో మార్పులు తెచ్చామని చెప్పారు. 

99 శాతం ఐటీ రిటర్నులు సెల్ఫ్​అసెస్​మెంట్ ​ద్వారానే జరుగుతున్నాయని చెప్పారు. ఇక నుంచి రిటర్నుల ప్రాసెస్​ను మరింత త్వరగా పూర్తి చేస్తామని, ట్యాక్స్​పేయర్ల చార్ట్​ను తెస్తామని నిర్మల వివరించారు.  1961 నాటి ఐటీ చట్టంలో మార్పులు తేవడానికి సీబీడీటీ ఇంటర్నల్​కమిటీని నియమించింది.