
నెక్కొండ / వర్ధన్నపేట/ నల్లబెల్లి/ గూడూరు, వెలుగు: రైతులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం గొట్లకొండలో గాయత్రి మహిళా పొదుపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కలెక్టర్ సత్యశారద, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్లు హరీశ్రావు, శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు.
నల్లబెల్లి మండలం గిర్నిబావి, మందపల్లిలో ఎమ్మెల్యే మాధవరెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. వర్ధన్నపేట మండలం ల్యాబర్తి, వెంకట్రావుపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ కన్న ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అయోధ్యపురంలో స్వర్ణభారతి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మురళీనాయక్ ప్రారంభించారు.