అల్లు శిరీష్ హీరోగా నటించిన చిత్రం ‘బడ్డీ’. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేష్ హీరోయిన్స్. శామ్ ఆంటోన్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ బ్యానర్పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా జులై 26న విడుదల కానుంది. శనివారం ఈ చిత్రం నుంచి ‘ఫీల్ ఆఫ్ బడ్డీ’ అనే లిరికల్ సాంగ్ను రిలీజ్ చేశారు.
ఈ పాటను హిప్ హాప్ తమిళ కంపోజ్ చేయడంతో పాటు ఐరా ఉడుపితో కలిసి పాడాడు. సాయి హేమంత్ లిరిక్స్ అందించాడు. ‘చూసాలే చూసాలే నాలో నీ కలనే... దాచాలే దాచాలే నాలో ఆ కలనే..వినవా వినవా నిజమే.. నిజమే కథలా మారిన క్షణమే’ అంటూ హార్ట్ టచింగ్గా సాగిన పాట ఆకట్టుకుంది. ఇందులో అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్ మధ్య పెరిగిన దూరాన్ని ఎమోషనల్గా చూపించారు. అలీ, అజ్మల్ అమీర్, ముఖేష్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.