
కరాచీ: ఆల్రౌండ్ పెర్ఫామెన్స్తో ఆకట్టుకున్న న్యూజిలాండ్ ట్రై నేషన్ సిరీస్లో విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో కివీస్ 5 వికెట్ల తేడాతో ఆతిథ్య పాకిస్తాన్ను ఓడించింది. తొలుత పాక్ 49.3 ఓవర్లలో 242 రన్స్కే ఆలౌటైంది.
కెప్టెన్ రిజ్వాన్ (46), సల్మాన్ అఘా (45), తయ్యర్ (38) రాణించారు. కివీస్ బౌలర్లలో విల్ ఒరూర్క్ నాలుగు, బ్రేస్వెల్, శాంట్నర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం కివీస్45.2 ఓవర్లలోనే 243/5 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. డారిల్ మిచెల్ (57), లాథమ్ (56), డెవాన్ కాన్వే (48) సత్తా చాటారు. ఒరూర్క్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, అఘాకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి.