
ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 26,236 శాంపిల్స్ పరీక్షించగా... 1,891 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 440 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 10,241 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఐదుగురు చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,06,943 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 22,38,226 మంది కరోనా నుంచి కోలుకున్నారు.ఇంకా 54,040 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య ఇప్పటి వరకు 14,677కి పెరిగింది.
మరిన్ని వార్తల కోసం..