ఒకేరోజు పవన్, ప్రభాస్ సినిమాల షూటింగ్లో పాల్గొన్న ముంబై బ్యూటీ

ఒకేరోజు పవన్, ప్రభాస్ సినిమాల షూటింగ్లో పాల్గొన్న ముంబై బ్యూటీ

ముంబై బ్యూటీఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజాసాబ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు వంటి బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే ప్రముఖ దర్శకులు క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ కలసి డైరెక్ట్ చేస్తున్న హరిహరవీరమల్లు సినిమా 60% శాతం షూటింగ్ పూర్తీ చేసుకుంది. 

ఇక డైరెక్టర్ మారుతి డైరెక్ట్ చేస్తున్న ది రాజాసాబ్ చిత్ర షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయ్యే దశలో ఉంది. అయితే ఈ రెండు సినిమాల షూటింగ్ ప్రారంభమై దాదాపుగా రెండేళ్ళు కావస్తున్నప్పటికీ ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఇతర పనులలో బిజీ కావడంతో ఇటీవలే మళ్ళీ షూటింగ్ షురూ చేశారు. 

దీంతో నిధి అగర్వాల్ హరిహర వీరమల్లు, ది రాజాసాబ్ చిత్రాల షూటింగ్ అప్డేట్ ని అభిమనులకి సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఇందులోభాగంగా ఒకేరోజున అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 2 పాన్-ఇండియన్ చిత్రాల షూటింగ్ లోపాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. 

ALSO READ | పెళ్లైన 12 ఏళ్లకు గుడ్‌న్యూస్‌: బేబిబంప్‌తో సర్ప్రైజ్ ఇచ్చిన ఆర్జీవీ హీరోయిన్..!

అలాగే ఈ రెండు సినిమాల షూటింగ్ ఒకటేమో ఆంధ్ర ప్రదేశ్ లో జరగ్గా మరొకటి తెలంగాణలో జరిగిందని,  మీతోపాటూ తాను కూడా ఈ రెండు సినిమాల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ఈ ట్వీట్ లో హరిహర వీరమల్లు, ది రాజాసాబ్ హ్యాష్ట్యాగ్ పెట్టింది. దీంతో ప్రముఖ డైరెక్టర్ మారుతి గుడ్ డెడికేషన్ & బెస్ట్ విషెస్ అంటూ నటి నిధి అగర్వాల్ ట్వీట్ కి ఇచ్చారు. ఈ ట్వీట్ తో పవన్ మరియు ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా నటి నిధి అగర్వాల్ చివరగా 2022లో  హీరో అనే చిత్రంలో నటించింది. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే అప్పటికే హరిహర వీరమల్లు,  ది రాజాసాబ్ చిత్రాలకి కమిట్ అయ్యి ఉండటంతో  ఈ సినిమాలను పూర్తీచేసే పనిలో పడింది.