మెగా డాటర్ నిహారిక (Niharika) నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్ పై వస్తున్న కొత్త సినిమా కమిటీ కుర్రాళ్లు (CommitteeKurrollu).కమిటీ కుర్రాళ్లు సినిమాతో ఏకంగా పదకొండు మంది హీరోలు,నలుగురు హీరోయిన్లను టాలీవుడ్కు పరిచయం చేస్తోంది నిహారిక.
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. "ఆగష్టు 9న థియేటర్లలో కుర్రోళ్ళ జాతర మొదలు..థియేటర్లలో మా కమిటీ కుర్రోళ్లతో భావోద్వేగాల రోలర్కోస్టర్ రైడ్ను అనుభవించడానికి సిద్ధంగా ఉండండి" అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో కమిటీ కుర్రాళ్ల అల్లరి చూపిస్తూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్, ఎలక్షన్స్ టార్గెట్ చేసుకుని వచ్చిన సాంగ్ ఆకట్టుకుంటోంది.
అలాగే ఈ మూవీకి స్పెషల్గా అట్రాక్షన్ గా చెప్పుకునే విషయం ఏంటంటే..కమిటీ కుర్రాళ్లు సినిమాతో ఏకంగా పదకొండు మంది హీరోలు, నలుగురు హీరోయిన్లను టాలీవుడ్కు పరిచయం చేస్తోంది నిహారిక. ఇక ఈ సినిమాలో నటించబోయే హీరోల విషయానికి వస్తే..ప్రసాద్ బెహరా,ఈశ్వర్ రచిరాజు, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, అక్షయ్ శ్రీనివాస్, శివకుమార్ మట్ట మిగిలిన హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. శరణ్య సురేష్, తేజస్వి రావు, విషిక, షణ్ముకి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఆగష్టు 9న థియేటర్లలో కుర్రోళ్ళ జాతర మొదలు 💥
— Pink Elephant Pictures (@PinkElephant_P) July 20, 2024
Get ready to experience a rollercoaster ride of emotions with our #CommitteeKurrollu in the THEATRES 🤩🔥#CKonAUG9🍿@IamNiharikaK @SRDSTUDIOS_ @yadhuvamsi92 @eduroluraju @anudeepdev @anwaraliedit @manyam73 @urs_jdmaster pic.twitter.com/KGJmrcNitM