పసికందుల ఊపిరితిత్తుల్లోకి పేగులు.. నలుగురికి ఆపరేషన్తో సరిచేసిన నిలోఫర్ డాక్టర్లు

పసికందుల ఊపిరితిత్తుల్లోకి పేగులు.. నలుగురికి ఆపరేషన్తో సరిచేసిన నిలోఫర్ డాక్టర్లు

మెహిదీపట్నం, వెలుగు: నలుగురు పసికందుల ఊపిరితిత్తుల్లోకి పేగులు రావడంతో నిలోఫర్ డాక్టర్లు ఆపరేషన్ తో వాటిని సరిచేశారు. సంబంధిత వివరాలను హాస్పిటల్​సూపరింటెండెంట్​రవికుమార్​వెల్లడించారు. నలుగురు గర్భిణులు జనగామ నుంచి వి.అనూష, కరీంనగర్​నుంచి ఎండీ.సల్మా, నల్గొండ నుంచి వై.నవనీత, మణికొండ నుంచి ఎం.దివ్య తమకు దగ్గరలోని ప్రైవేటు హాస్పిటల్స్​లో ట్రీట్​మెంట్​తీసుకున్నారు. 

డెలివరీ సమయానికి బేబీల ఊపిరితిత్తుల్లోకి పేగులు వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. నలుగురినీ నిలోఫర్​హాస్పిటల్​కు రిఫర్​చేయడంతో నెల రోజుల క్రితం జాయిన్​అయ్యారు. వైద్యులు ప్రసవం చేసి, పసికందులను అబ్జర్వేషన్​లో ఉంచారు. ఆపరేషన్​ద్వారా పేగులను సరిచేశారు. 20 రోజుల తర్వాత తల్లులు, బిడ్డల ఆరోగ్యం బాగుండటంతో మంగళవారం డిశ్చార్జ్​చేశారు. 

ఈ సందర్భంగా సూపరింటెండెంట్​మాట్లాడుతూ..పేగులు ఊపిరితిత్తుల్లోకి రావడాన్ని కంజెంటల్ డై ఫ్రాగ్మెంట్ హెర్నియా అంటారని చెప్పారు. పుట్టిన పిల్లలకు ఇది రావడం చాలా అరుదని తెలిపారు. ఈ ఆపరేషన్​ఎంతో క్లిష్టమైందని పేర్కొన్నారు. పీడియాట్రిక్ సర్జన్​నారాయణ, నియోనటాలజీ హెచ్ వోడీ స్వప్న టీం, ఆర్ఎంవో నాగజ్యోతి ఉన్నారు.