నిమ్స్​కు 20 వీల్​ చైర్లు అందజేత

నిమ్స్​కు 20 వీల్​ చైర్లు అందజేత

పంజాగుట్ట,వెలుగు:  నిమ్స్ ఆస్పత్రిలో తన తల్లికి మెరుగైన వైద్య సేవలు పొందిన వ్యక్తి రోగుల కోసం తనవంతు సహాయంగా 20 వీల్​చైర్లను అందజేశాడు. నల్గొండకు చెందిన రాఘవేంద్ర రెడ్డి తల్లి జయప్రద గతంలో అనారోగ్యానికి గురైంది. నిమ్స్​ వైద్యుల మెరుగైన వైద్య చికిత్సతో ఆమె తొందరగా కోలుకుంది. కృతజ్ఞతా భావంతో గురువారం 20 వీల్​ చైర్లను తీసుకు వచ్చి అడిషనల్​ మెడికల్​ సూపరింటెండెంట్​ డాక్టర్​ లక్ష్మీ భాస్కర్​కు అందజేశారు.