అనస్థీషియా వైల్ తీసుకొని నిమ్స్ ప్రొఫెసర్ సూసైడ్

అనస్థీషియా వైల్ తీసుకొని నిమ్స్ ప్రొఫెసర్ సూసైడ్

సికింద్రాబాద్: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ లో అనస్థీషియా అడిషనల్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహించే ప్రాచీకార్  (46) ఆత్మహత్య చేసుకున్నారు. బేగంపేట బ్రాహ్మణవాడిలోని ఆమె ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి అనస్థీషియ మత్తు వాయిల్ తీసుకున్నారు. అది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం వెంటనే నిమ్స్ కి తరలించారు. అప్పటికే ప్రాచీకార్ మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఆత్మహత్యకు గలకారణాలు తెలియాల్సి ఉంది. బేగంపేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.